“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా విడుదలైన “సాహో” ట్రైలర్ సినిమా పై అంచనాలని భారీగా పెంచేసింది.
కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్, శ్రద్ధా కపూర్ల రొమాన్స్తో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ని షేక్ చేయబోతున్నట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ని చూస్తే అర్థమవుతోంది. టేకింగ్, ప్రభాస్ నటన, యాక్షన్ పార్ట్, హై టెక్నికల్ వేల్యూస్ అద్భుతంగా ఉన్నాయంటూ అందరూ ట్రైలర్ని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ పై యంగ్ మెగా హీరో సాయి తేజ్ స్పందిస్తూ “చాలా టైమ్ తీసుకున్నా.. ప్రతి తెలుగువాడు గర్వపడేలా తీశారు. ప్రభాస్ అన్నా!..సిక్సర్ ఔట్ ఆఫ్ ది పార్క్” అంటూ ట్వీట్ చేశారు. యు.వి.క్రియేషన్స్, సుజిత్, ప్రభాస్, చిత్ర టీంకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు సాయితేజ్.