telugu navyamedia
సినిమా వార్తలు

మోడీకి సీనియర్ నటి శుభాకాంక్షలు… దేశం విడిచి వెళ్లాలంటూ నెటిజన్ల ట్రోలింగ్

Shabana-Ajmi

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ “భారత ప్రజలు ఎంతో బలమైన ప్రజాతీర్పునిచ్చారు. నరేంద్ర మోదీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు గొప్ప అభినందనలు” అని ట్వీట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మాత్రం షబానాను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ట్రోల్ చేస్తున్నారు. చాలామంది ఆమెను పాకిస్తాన్ ఎప్పుడు వెళతారంటూ అడుగుతున్నారు. పాకిస్తాన్ వెళ్లేందుకు రాత్రికి కూడా బండి ఉంది. ఎప్పుడు వెళుతున్నారు? అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం షబానా ఆజ్మీ, నరేంద్ర మోదీ మరోమారు అధికారంలోకి వస్తే, తాను దేశం విడిచి వెళ్లిపోతానంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆమె ఆ తరువాత తన వ్యాఖ్యలను సరిదిద్దుకుంటూ తాను భారత్‌లోనే పుట్టానని, ఇక్కడే తన అంతిమశ్వాస తీసుకుంటానని పేర్కొన్నారు. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ ట్రోల్ చేస్తున్నారు.

Related posts