telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

ఈ ఏడాది కూడా .. సైన్యంతో దీపావళి జరుపుకుంటున్న .. మోడీ..

pm modi with soldiers on deepavali

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దీపావళిని భారత సైన్యంతో కలిసి జరుపుకుంటున్నారు. ఇందుకోసం ఆయన… ఇవాళ జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు స్థావరాలకు వెళ్లే అవకాశాలున్నాయి. జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి హోదాను తొలగించిన తర్వాత తొలిసారిగా మోదీ కాశ్మీర్ వెళ్తున్నారు. ఇదివరకు మోదీ… పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో ఉండే సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. అలాగే ఇదివరకు ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు స్థావరాల్ని సందర్శించారు. ఈసారి కూడా సైన్యంతో దీపావళి జరుపుకుంటూ… సరిహద్దుల్ని పరిశీలిస్తారని తెలిసింది.

ఈ సందర్భంగా ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం చేసిన ఆపరేషన్‌పై ప్రధానికి వివరించే అవకాశాలున్నాయి. 2014లో తొలిసారి ప్రధాని అయిన మోదీ… ఆ ఏడాది దీపావళిని ప్రపంచంలో ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ గ్లేషియర్ బేస్ క్యాంప్‌లో జరుపుకున్నారు. అప్పటి నుంచీ ఏటా ఇలా సైన్యంతో దీపావళి జరుపుకుంటూ… వారికి స్వీట్లు పంచిపెడుతున్నారు మోదీ. ఐతే… ఏటా ఆయన ఎక్కడ జరుపుకుంటున్నదీ ముందుగా వెల్లడించట్లేదు. ఈసారి కూడా అధికారికంగా ప్రకటన రాలేదు.

Related posts