telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా బారిన 20 వేల మంది పోలీసులు!

Maharashtra police corona

మహారాష్ట్రలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఈ మహమ్మారి బారినపడుతున్నారు. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 20 వేల మందికిపైగా పోలీసులు కరోనా బారినపడినట్టు అధికారులు నిన్న వెల్లడించారు. గత 24 గంటల్లోనే ఏకంగా 364 మంది వైరస్ బారినపడినట్టు పేర్కొన్నారు.

కరోనా బారినపడిన 20 వేల మందికిపైగా పోలీసుల్లో 2 వేల మందికిపైగా అధికారులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 208 మంది పోలీసులు మృతి చెందారు.

మరణించిన వారిలోనూ 21 మంది ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్టు చెప్పారు. పోలీసు శాఖలో ఇంకా 3 వేలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు వివరించారు. అలాగే, 16 వేల మందికిపైగా పోలీసులు కోలుకున్నారు.

Related posts