రాజకీయ లబ్ది కోసమే వైసీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇతరులు సర్వే చేస్తే వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ సర్వేలంటే వైసీపీకి భయమని సీఎం వ్యాఖ్యానించారు. ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2019-24కు సమర్ధ బృందాన్ని ఎంపిక చేస్తున్నామని తెలిపారు.
అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయమే ప్రామాణికమని స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం రాని వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. బెదిరింపుల వల్లే కొందరు టీడీపీకి దూరమవుతున్నారని చెప్పుకొచ్చారు. బ్లాక్ మెయియలింగ్ చేసి టీడీపీ దూరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆస్తులను చూపించి బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.