telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మోదీ ద్రోహం చేసిన చోట రాహుల్ భరోసా: రఘువీరా

మోదీ ద్రోహం చేసిన స్థలంలోనే రాహుల్ భరోసా కల్పిస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ మైదానంలోనే కాంగ్రెస్ అధినేత రాహుల్ సభను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఆ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే ప్రకటనను రాహుల్ చేస్తారని రఘువీరా తెలిపారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటు సాక్షిగా సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. 
బీజేపీ మోసం చేస్తోందన్న జ్ఞానోదయం టీడీపీకి కలిగిందని రఘువీరా చెప్పారు, అందుకే కాంగ్రెస్ తో చేయి కలిపిందని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీని వైసీపీ కనీసం ప్రశ్నించడం లేదన్నారు. హోదాపై సంతకం చేసే వారికే తమ మద్దతు అంటూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఉందని తెలిపిన ఆయన ఏపీలో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Related posts