మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నట్టే ఉంది.. అందుకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) తో భేటీ అయ్యింది. పీకేను ఎన్నికల వ్యూహకర్తగా మమతా బెనర్జీ నియమించుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవాలని మమత గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో మమతను పీకే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రశాంత్ కిశోర్ కు చెందిన ‘ఐ ప్యాక్’ సేవలను వినియోగించుకోవాలని ఆమె చూస్తున్నట్టు సమాచారం. కాగా, ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పని చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని అందుకుంది.