ఇటీవలే తమన్నా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్న ఆమె.. తాజాగా కోవిడ్ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, ఆ తర్వాత తన ఫోటోలు చూసి నెటిజన్స్ రియాక్ట్ అయిన తీరు గురించి వివరించింది. తనకు కరోనా సోకిందనే విషయం తేలియాగానే కంగారు పడ్డానని, పైగా తనలో కోవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో చనిపోతానేమో అని భయమేసిందని తమన్నా చెప్పింది. ఆ సమయంలో వైద్యులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి తనను కాపాడారని ఆమె పేర్కొంది. ఇకపోతే కోవిడ్ సమయంలో తనకు అండగా నిలుస్తూ సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు, డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది తమన్నా. ఆ సమయంలోనే తనకు జీవితం విలువ తెలిసిందని చెప్పిన మిల్కీ బ్యూటీ.. కోవిడ్ నుంచి కోలుకున్నాక కొందరు నెటిజన్స్ చేసిన కామెంట్స్ తీవ్రంగా బాధపెట్టాయని తెలిపింది. కరోనా టైమ్లో ఎక్కువగా మందులు వాడటం వల్ల కాస్త బరువు పెరిగితే దాన్నే టార్గెట్ చేస్తూ కొందరు చేసిన కామెంట్స్ చిరాకు తెప్పించాయని తమన్నా చెప్పుకొచ్చింది.
previous post
next post