కరోనా వైరస్పై భారత్లో ప్రజాపోరాటం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మన్కీ బాత్లో మోదీ మాట్లాడారు. ప్రతి ఒక పౌరుడు సైనికుడిలా వైరస్పై యుద్ధం చేస్తున్నారన్నారు. ప్రజలు, ప్రభుత్వాధికారులు కలిసికట్టుగా పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు.కరోనా సంక్షోభ వేళ రైతులు మాత్రం నిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండేందుకు రైతులు శ్రమిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యానికి తగినట్లు పోరాడుతున్నారన్నారు. కొందరు ఇంటి కిరాయిలను మాఫీ చేస్తున్నారని, క్వారెంటైన్లో ఉన్న వాళ్లు స్కూళ్లకు రంగలు అద్దుతున్నారన్నారు. కోవిడ్ వారియర్స్ అనే డిజిటల్ ఫ్లాట్ఫామ్ను క్రియేట్ చేశామని తెలిపారు. ఎన్జీవోలు, స్థానిక ప్రభుత్వాలు దాంట్లో భాగమైనట్లు ఆయన పేర్కొన్నారు.
s
రాజన్న రాజ్యం కోసం ఐదేళ్లు కష్టపడ్డాం: లక్ష్మీపార్వతి