telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రుణమాఫీని ఒకే విడతలో అమలు చేయాలి: చాడ వెంకట్ రెడ్డి

chada venkat reddy cpi

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు నిధులు ఇవ్వాలని, రుణమాఫీని ఒకే విడతలో చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి కరువు నివేదిక పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. రెవెన్యూశాఖలో లొసుగులు ఉన్నాయని ముందే చెప్పామని వివరించారు. ఆయా శాఖల్లో లంచాలు తీసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కావాల్సింది లంచాల తెలంగాణ కాదని, బతుకుల తెలంగాణ కావాలి అని అన్నారు. భూసమగ్ర సర్వే చేసి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని చాడ డిమాండ్ చేశారు.

Related posts