2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020 లోనే మృతి చెందారు. అటు కరోనా తో చాలా మంది సినీ నటులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. సీనియర్ ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి ఇకలేరు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
previous post
కేటీఆర్ ను అవినీతిపరుడు అనడం నచ్చలేదు: పోసాని