ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1గా ఉన్న మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
ఆయనను అరెస్ట్ చేసేందుకు 8 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
కాగా ఈరోజు పిన్నెల్లి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది.
మరికాసేపట్లో ఈ పిటిషన్ను ధర్మాసనం విచారించనుంది.