శాన్ ఆంటోనియో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల బాలుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రిసిల్లా పినాలేస్ వెగా అనే మహిళ తన ఆరేళ్ళ కుమారుడు జేస్ తో కలిసి టూర్కు వెళ్లి తిరిగి వస్తున్న భర్త జోయ్ వెగాను రిసీవ్ చేసుకోవడానికి శాన్ ఆంటోనియో ఎయిర్పోర్టుకు వెళ్లింది. విమానాశ్రయంలో తల్లికొడుకు వేచి చూస్తున్న క్రమంలో అప్పుడే వచ్చిన విమానం నుంచి సైనికులు దిగారు. వారిని చూసిన జేస్ వెంటనే లేచి నిలబడి సెల్యూట్ చేశాడు. ఆ సమయంలో ప్రిసిల్లా తనతో పాటు తీసుకెళ్లిన కెమెరాతో కుమారుడి ఫొటో తీసింది. అనంతరం దాన్ని భర్త జోయ్కు చూపించింది. అది చూసిన జోయ్ కుమారుడు జేస్ను ఎందుకు అలా చేశావని అడిగాడు. అప్పుడు జేస్ చెప్పిన సమాధానమేంటో తెలుసా? “ఎందుకంటే వారు మనల్ని రక్షిస్తున్నారు డాడీ” అని చెప్పాడు. ఆరేళ్ల తమ కొడుకు నోటి వెంట ఆ మాటలు విన్న వెగా దంపతులు గర్వంగా ఫీలయ్యారు. ఇక జేస్కు సంబంధించిన ఫొటో కాస్తా బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
previous post
next post
ఇసుక విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి: పురంధేశ్వరి