telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేశవ్‌ ను పరామర్శించిన చంద్రబాబు

chandrababu keshavulu

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్‌ (పీఏసీ) పయ్యావుల కేశవ్‌ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించి, కొద్ది సేపు మాట్లాడారు.వైద్యులతో మాట్లాడి పయ్యావుల కేశవ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పయ్యావుల కేశవ్ గారిని, వారి కుటుంబసభ్యులను పరామర్శించాను. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాను. కేశవ్ గారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని చంద్రబాబు ఫేస్ బుక్ పోస్టులో తెలిపారు.

Related posts