ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉండటంతో మహిళా సంఘాలు, విద్యార్థినులు, ప్రజా సంఘాలు పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గని నిరసనకారులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. స్టేషన్ గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో… పోలీసులు బేడీలను వేసి, స్టేషన్ గేటును మూసేశారు. పీఎస్ గేటుకు బేడీలు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.