భీమ్లా నాయక్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. జనవరి 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
పవర్స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని భీమ్లా నాయక్ పేరుతో తెలుగులో రీమేక్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు..సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాణా సరసన మలయాళ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు, రైటర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు ఓ పాట కూడా రాశారు.
జనవరి 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ఈ సందర్భంలో దిల్రాజు మాట్లాడుతూ ‘‘పాండమిక్ తర్వాత ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. వరుస సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో RRR, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రకారమే అనౌన్స్మెంట్స్ కూడా చేశామని వెల్లడించారు.
అయితే “మూడేళ్ల క్రితమే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ షూటింగ్ ప్రారంభించుకున్నాయి. చాలా కాలంగా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతూ వచ్చాయి. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే.
అందుకే ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీని వాయిదా వేయాలని మాతో పాటు సంక్రాంతికి రిలీజ్ అవబోయే సినిమాల నిర్మాతలు పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, చినబాబు, వంశీని కోరాం. వారు కూడా ఇందుకు ఒప్పుకొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘భీమ్లా నాయక్’ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న రానుండగా.. ‘ఎఫ్3’ ఏప్రిల్ 29న రిలీజ్ కానున్నాయి.