పాకిస్థాన్ ఆర్మీ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ మరికాసేపట్లో భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. అభినందన్ ని విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశమంతా ఆనందోత్సోహాల్లో మునిగిపోయిన వేళ పాకిస్తానీయులు మరోసారి కపట బుద్ధి ప్రదర్శించారు. అభినందన్ను విడుదల చేయాలంటూ తమ దేశమంతా కోరుకుంటోందని చెబుతూనే..పాక్ మరో మెలిక పెట్టింది. పాకిస్తానీయులు మరోసారి వారి కపట బుద్ధి ప్రదర్శించారు.
మరోవైపు అతడిని ఎలా విడిచి పెడతారంటూ పలువురు పాక్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాగా భారత్ సహా అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి తలొగ్గిన పాక్ ప్రభుత్వం..ఆయనను రావల్పిండి నుంచి లాహోరుకు విమానంలో తరలించనుంది. దీంతో శుక్రవారం ఆయన వాఘా సరిహద్దు ద్వారా భారత్లో అడుగు పెట్టనున్నారు.
టీడీపీని అప్రతిష్టపాలు చేయడమే వైసీపీ లక్ష్యం: యనమల