పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోయే ఎలక్షన్ల లోపు సాధ్యమైనన్ని సినిమాలు చేసి మళ్లీ పాలిటిక్స్తో బిజీ అవ్వాలనే పవన్ ప్లాన్కు కరోనా రూపంలో అడ్డు తగిలింది. ఇప్పుడు షూటింగ్స్కు అనుమతులు వచ్చినా.. ధైర్యంగా షూటింగ్కు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే పవన్ కోసం ఇప్పటికే ముగ్గురు దర్శకులు వేచి చూస్తున్నారు. అందులో వేణు శ్రీరామ్ తన ‘వకీల్సాబ్’ను దాదాపు 60 నుంచి 70 శాతం వరకు షూటింగ్ కంప్లీట్ చేస్తే.. క్రిష్ చేయాలనుకుంటున్న ‘విరూపాక్ష’కు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు. మరో దర్శకుడు హరీష్ శంకర్ స్ర్కిప్ట్ వర్క్లో ఉన్నారు. ఇక క్రిష్-పవన్ చేయాలనుకుంటున్న ‘విరూపాక్ష’ (వర్కింగ్ టైటిల్)కు సంబంధించి ఈ మధ్య కాస్త గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఈ సినిమా కోసం అని వేసిన సెట్ పడిపోయిందని, దాని వల్ల కోటి రూపాయలు నష్టం అని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వినబడుతుంది. ఈ సినిమాతో తొలిసారి పవన్ సినిమాకు సంగీతం అందిస్తున్న కీరవాణి, ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ పార్ట్ను కంప్లీట్ చేశారని, ఈ చిత్రంలో కేవలం రెండే పాటలు ఉంటాయనే అప్డేట్ వినబడుతుంది. ఈ రెండు పాటలను కీరవాణి కంప్లీట్ చేసి పవన్, క్రిష్లకు వినిపించాడని, వారూ ఓకే చేశారని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించనుందని టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వినిపించే అవకాశం ఉంది.
previous post