ఇదివరకే టాలీవుడ్ పరిశ్రమలో చాలామంది రచయితలు దర్శకులుగా మారారు. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్లో చాలా మంది ఒకప్పుడు రైటర్స్గా పని చేసినవారే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా కొంత మంది రచయితలు దర్శకులుగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంచె, కృష్ణం వందే జగద్గురమ్, గౌతమిపుత్రశాతకర్ణి, ఖైదీనంబర్ 150, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలకు మాటలను అందించిన రచయిత సాయిమాధవ్ బుర్రా త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నారని తెలుస్తోంది. అది కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోను సాయిమాధవ్ బుర్రా డైరెక్ట్ చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి. రీసెంట్గా ప్రభాస్ను సాయిమాధవ్ బుర్రా కలిసి పాయింట్ను చెప్పాడట. అది ప్రభాస్కు నచ్చి, గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా పూర్తయిన తర్వాతే సాయిమాధవ్ బుర్రా దర్శకత్వంలో సినిమా చేస్తాడని టాక్.
previous post