మజిలీ, వెంకీ మామ తో సూపర్ హిట్స్ సాధించిన నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. “లవర్స్” అనే పేరుతో ఈ సినిమా ప్రచారం జరుపుకుంటుంది. కాగా నాగ చైతన్య, గీత గోవిందం వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో చిత్రాన్ని గద్దలకొండ గణేష్ లాంటి మాస్ హిట్ అందించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. నాగ చైతన్య 20 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు అతి త్వరలో తెలియజేయనున్నారు. గీతా గోవిందం చిత్రంతో హిట్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిన పరశురాం తన తదుపరి సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. ఆ మధ్య మహేష్, అల్లు అర్జున్, అఖిల్లలో ఒకరితో పరశురాం సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కాని ఆ ప్రచారాలని తలకిందులు చేస్తూ అక్కినేని హీరో నాగచైతన్యతో సినిమా చేయబోతున్నాడు. కాగా, పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న నాగచైతన్య 20వ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
శ్రీముఖి అంటేనే ఇష్టం… : రాహుల్ తల్లి సుధారాణి