‘చిత్రం చెప్పిన కథ’ అనే చిత్రం ఉదయ్ కిరణ్ నటించిన చివరి చిత్రం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన మదాలస శర్మ హీరోయిన్గా నటించింది. మోహన్ ఎ ఎల్ ఆర్ కె దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మున్నా కషి సంగీతం అందించారు. ఉదయ్ కిరణ్ మేనేజర్ అయిన మున్నా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాత మున్నా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక ఎప్పటికప్పుడు ఈ చిత్రం వాయిదా పడుతూనే ఉంది. తాజాగా ఆయన జయంతిని పురస్కరించుకుని మరోసారి ఈ చిత్ర విడుదలపై వార్తలు బయటికి వచ్చాయి. ఈ చిత్రాన్ని త్వరలో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారట. ఉదయ్ కిరణ్కు ఈ చిత్రాన్ని అంకితమిస్తూ.. జూన్ 26 ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా ఆయన నటించిన చివరి చిత్రాన్ని ఎలాగైనా విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాత ప్రకటించారు. ‘చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే’ వంటి సినిమాలతో నటుడు ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా సక్సెస్ఫుల్ హీరోగా పేరుపొందాడు. అప్పట్లో అమ్మాయిలు అందరూ ఉదయ్ కిరణ్ అంటే ఎంతో ఇష్టపడేవారు. ఇక ఆయన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలతో డిప్రెషన్కు లోనైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని అభిమానులకు తీరని శోకం మిగిల్చాడు.
previous post