వెండితెర అసమాన నటి శ్రీదేవి బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా పెళ్ళికని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న బాత్ టబ్లో మునిగి కన్ను మూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్ దివంగత అందాల తార శ్రీదేవి జీవిత చరిత్రను “శ్రీదేవి: ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్” అనే పుసక్త రూపంలో పొందుపరిచిన సంగతి తెలిసిందే. శ్రీదేవి బాల్యం నుండి స్టార్ హీరోయిన్గా ఎదిగే వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఈ పుసక్తంలో ఉండబోతున్నాయి. ఈ పుసక్తానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాటను రాయడం విశేషం. దీని గురించి ఆమె మాట్లాడుతూ “ఐకాన్ శ్రీదేవిగారి నటనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్” అన్నారు.
previous post
next post