అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘లవ్స్టోరీ’ ట్రైలర్ వచ్చేసింది. ఫీల్గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇందులో చైతన్య, సాయిపల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉన్నాయి. నాగచైతన్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు సూపర్బ్. బిజినెస్ చేయాలనుకునే ఆలోచనలో చైతూ పడ్డ కష్టాలను చూపించారు. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇబ్బందులు సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నట్టు కనిపిస్తోంది.
కుటుంబ పోషణ కోసం పట్నం వచ్చి డ్యాన్స్ మాస్టర్గా ఇరుగుపొరుగు వారికి క్లాసులు చెబుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అబ్బాయిగా నాగచైతన్య కనిపించనున్నారు. అదే సమయంలో సాయిపల్లవి సైతం బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగం వేటలో ఉన్న అమ్మాయిగా సందడి చేయనున్నారు.
ఇందులో హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్సర్గా కనిపించబోతుంది. తెలంగాణ యాసలో ఈ సారి జాబ్కొట్టకపోతే ఇక అంతే..బాసండ్లు తోముడే అంటూ తన ఫ్రెండ్తో చెప్పే డైలాగ్ వీపరితంగా ఆకట్టుకుంటోంది.
అంతే కాకుండా .. ‘బతుకు కోసం ఈ ఊరుకులాడటం మాత్రం నాతోని కాదింక. చస్తే చద్దాం.. కానీ, తెల్చుకుని చద్దాం’ అంటూ ట్రైలర్ చివర్లో నాగచైతన్య చెప్పే డైలాగ్ భావోద్వేగానికి గురి చేస్తోంది. ట్రైలర్లో చైతూ, సాయి పల్లవి మధ్య డైలాగులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ సన్నివేశాలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్స్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక పిక్ పై కలెక్టర్ కామెంట్… షాక్ లో నెటిజన్లు