అక్టోబర్ 10 నుంచి “వైఎస్సార్ కంటి వెలుగు” పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు దశల్లో అమలు చేయనున్న ఈ పథకంలో భాగంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.
తొలి రెండు దశల్లో పాఠశాల విద్యార్థులకు, అనంతరం కమ్యూనిటీ బేస్ ఆధారంగా పరీక్షలు చేస్తారు. ఈ పథకంలో భాగంగా స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, కేటరాక్ట్ ఆపరేషన్లతోపాటు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకం పర్యవేక్షణకు ఆయా జిల్లా కలెక్టర్లు చైర్మన్గా వ్య్వాహరిస్తారు. అదేవిధంగా టాస్క్ఫోర్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.