telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

షర్మిలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు…

బైబిల్ విజయమ్మ, సిస్టర్ షర్మిల, బ్రదర్ అనిల్ తెలంగాణ యెహోవా రాజ్యం తీసుకు రావాలని అనుకుంటున్నారా..  దీని వెనుక కేసీఆర్ ఉన్నాడని మండిపడ్డారు షర్మిలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్. బైబిల్ విజయమ్మ మార్గదర్శకత్వంలో  సిస్టర్ షర్మిల చాలా చాలా మాట్లాడారని..  రాజన్న రాజ్యం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అంట? అని ఎద్దేవా చేశారు.   రాజన్న రాజ్యం అంటే  దోచుకోవడం దాచుకోవడం, జల యజ్ఞాన్ని- ధన యజ్నంగా మార్చడమని.. అప్పట్లో కేసుల్లో ఇరుక్కున్న వారు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చురకలు అంటించారు.   అవినీతి పాలన, పార్టీలను చీల్చిన చరిత్ర రాజన్న రాజ్యంలోనే జరిగిందని… కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిన్న సభ జరిగింది.. ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.   సిస్టర్ షర్మిల ప్రసంగం కేసీఆర్ కనుసన్నల్లోనే తయారు అయిందని… కల్వకుంట్ల దర్శకత్వంలోనే ఆమె కార్యక్రమాలు నడుస్తున్నాయని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో లక్ష మందితో ముఖ్యమంత్రి బహిరంగ సభకు ఎలా అనుమతి ఇస్తారని మండిపడ్డారు.

Related posts