telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికకు 119 నామినేషన్‌లు

After 11 Parishat Elections Telangana

తెలంగాణలో హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్‌ల గడువు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. ఈ ఎన్నికలో పోటీచేసేందుకు మొత్తం 119 నామినేషన్‌లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు.

అక్టోబర్ 1న నామినేషన్‌ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్‌ల ఉపసంహకరణకు అక్టోబరు 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్ 21న ఎన్నికలు, 24న ఫలితాలు వెలువడున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోటా రామారావు, టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి, సీపీఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖరరావు నామినేషన్లు దాఖలు చేశారు.

Related posts