అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ సినిమా ఎంతో మంచి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే, నివేథా పేతురాజ్ నటించారు. ఈ సినిమాతో ఈ ఇద్దరు హీరోయిన్లకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో నివేథా మంచి క్రేజ్ను సంపాదించింది. అందులో భాగంగానే ఈ భామ రామ్ తమిళ రీమేక్ రెడ్లోనూ నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. కథాంశాల ఎంపికలో ఇక ముందు చాలా సెలెక్టివ్గా ఉంటానని పేర్కొంది. కమర్షియల్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని గ్లామర్ చేయడానికి తాను సిద్ధమేనని తెలిపింది. రెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తానని తెలిపింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే… ఈ సినిమా ఏ మేరకు అందరినీ ఆకట్టుకుంటుందో చూడాలి.
previous post