telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయనున్న కియారా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ వకీల్ సాబ్ సినిమాతో ఇవ్వనున్నాడు. ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కనిపించనున్నడు. ఈ సినిమా అనేక అవాంతరాల తరువాత ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. కానీ తరువాత సంక్రాంతికి వకీల్ సాబ్ రావడం లేదంటూ అభిమానులను నిరాశ పరిచింది. అయితే.. ఈ సినిమా తర్వాత హరీష్‌-శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో గబ్బర్‌ సింగ్‌ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. అయితే.. ఈ సినిమా మొదలు కాకముందే కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కియారా అద్వానీ హీరోయిన్‌గా భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఇక బాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉంది ఈ భామ. మరి హరీష్‌ శంకర్‌ – పవన్‌ కళ్యాణ్ సినిమాలో ఆమెను అప్రోచ్‌ అవ్వగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న కియారా టాలీవుడ్ లో సినిమా చేస్తుందా అన్నది చూడాలి.

Related posts