ఉరితీసే ముందు నిర్భయ దోషులను చివరి కోరిక చివరి కోరిక ఏమిటని తీహార్ జైలు అధికారులు అడిగారు. దోషులు ఎలాంటి సమాధానం రాలేదు. చివరి కోరిక చెప్పకుండానే నిర్భయ దోషులు ఉరికంబం ఎక్కారు. దోషులు ముఖేశ్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లలో ఏ ఒక్కరు కూడా తమ చివరి కోరికను వెల్లడించలేదు. దీంతో ధృవపత్రాలపై సంతకాలు తీసుకుని ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష ప్రక్రియ పూర్తి చేశారు.
అనంతరం నిబంధనల ప్రకారం అరగంటపాటు వారిని అలాగే ఉరికంబానికి వేలాడదీశారు. ఆ తర్వాత మృతదేహాలను కిందికి దించారు. పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్టు నిర్ధారించిన తర్వాత పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.