గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ భారీ రివార్డ్ ప్రకటించింది.
దావూద్తో పాటు అతని ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఆచూకీ కానీ.. వారికి సంబంధించిన సమాచారం కానీ చెప్పిన వారికి భారీ రివార్డ్ ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది.
దావుద్ ఇబ్రహీంను అరెస్ట్ చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇచ్చిన వారికి రూ. 25 లక్షలు, చోటా షకీల్ సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షలు ఇస్తామంది. ఇతర టెర్రరిస్టులు అనీస్ ఇబ్రహీం, జావెద్ చింకా, టైగర్ మెమన్ లపై రూ. 15 లక్షల చొప్పున రివార్డ్ అనౌన్స్ చేసింది.
భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ..1993 ముంబయి వరుస పేలుళ్ల ఘటనలో నిందితుల కోసం ఎప్పటినుంచో గాలిస్తోంది.
అయితే వీరి ఆచూకీ లభించలేదు. దీంతో వీరిని అరెస్టు చేసేందుకు వీలుగా ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని దావూద్కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది.