telugu navyamedia
క్రైమ్ వార్తలు

కరోనా భయంతో… దగ్గినందుకు తుపాకీతో కాల్చేశాడు…

crime

ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కరోనా ఫీవర్ పట్టుకుంది. ఎవరైనా తమ్మినా,దగ్గినా ప్రజలు భయపడిపోతున్నారు. ఐతే తాజాగా యూపీలో తుమ్మినందుకు పాతికేళ్ల యువకుడిపై దుండగుడు కాల్పులు జరిపాడు. కరోనా భయంతో బీభత్సం సృష్టించాడు. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దయానగర్‌కు చెందిన ప్రశాంత్ సింగ్ అలియాస్ ప్రవేశ్ (25) వ్యవసాయం చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో పనులు లేక ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గ్రామంలోని ఓ దేవాలయంలో మరో ముగ్గురు మిత్రులో కలిసి లూడో గేమ్ ఆడాడు. వారు గేమ్ ఆడుకుంటున్న క్రమంలో జైవీర్ సింగ్ అలియాస్ గుల్లు (30) అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ప్రవేశ్ దగ్గాడు. అప్పుడు ఎవరూ ఏమనలేదు. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ దగ్గాడు. దాంతో కోపోద్రిక్తుడైన గుల్లు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నావంటూ ప్రవేశ్‌పై మండిపడ్డారు. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో.. గుల్లు తన జేబులో నుంచి తుపాకీ తీసి ప్రవేశ్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం గుల్లు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో తోటి మిత్రులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరించాడు. ప్రస్తుతం ప్రవేశ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts