telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఐదు మొండాలు, రెండు తలలతో తీరానికి కొట్టుకొచ్చిన బోటు… అధికారులు షాక్

North

జపాన్‌‌ దేశం బయట ఉన్న సాదో ద్వీపానికి శనివారం ఓ బోటు కొట్టుకొచ్చింది. ఆ బోటులో ఐదుగురి మనుషుల మొండాలు కనిపించడంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. తాము శుక్రవారమే బోటును గుర్తించామని.. అయితే వాతావరణ సమస్య కారణంగా శనివారం వరకు బోటును తీరానికి తరలించలేకపోయామని సాదో ద్వీపం కోస్ట్ గార్డ్ అధికారి కీ చినెన్ తెలిపారు. బోటులో ఐదు మొండాలతో పాటుగా రెండు తలలు కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ బోటు నార్త్ కొరియా నుంచి వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బోటులో లభ్యమైన రెండు తలలు ఐదు మొండాలకు చెందినవా.. లేదా వేరే ఇద్దరివా అన్నది తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బోటులో కొరియన్ భాషలో రాసి ఉన్న ఉత్తరాలు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, నార్త్ కొరియా ప్రయోగించిన ఓ మిస్సైల్ జపాన్ వెళ్తున్న బోటుపై పడినట్టు జపాన్‌కు చెందిన ఓ మీడియా చానెల్ శుక్రవారం పొరపాటున టెలికాస్ట్ చేసేసింది. అనంతరం తాము చేసిన పొరపాటుకు క్షమాపణలు తెలిపుతున్నట్టు ప్రకటించింది.

Related posts