telugu navyamedia
తెలంగాణ వార్తలు

పాలేరు వాగులో చిక్కుకున్న 23మంది కూలీలు..ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్​ఎఫ్..

*వాగులో చిక్కుకున్న 23మంది కూలీలు.. ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్​ఎఫ్..
 *పాలేరు వాగులో 23 మంది వ్య‌వ‌సాయ కూలీలు..
* పాలేరు వాగు మ‌ధ్య‌లో ఉన్న వ్య‌వ‌సాయ క్షేత్రంలో చిక్కుకున్న కూలీలు
* నిన్న వాగులో చిక్కుకున్నవ్య‌వ‌సాయ కూలీల‌ను ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్​ఎఫ్

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం, కొత్తపల్లి గ్రామాల మధ్య పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలను ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది సురక్షితంగా బయట‌కు వ‌చ్చారు.

నిన్న వాగు మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు వేసేందుకు 23 మంది కూలీలు వెళ్లారు. నిన్న కురిసిన వర్షానికి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అక్కడే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు.

భద్రాచలం నుంచి ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం… మొదట తొమ్మది మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరి కొంత మందిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో తాడు తెగిపోవడంతో మళ్లీ ప్రయత్నించింది. కానీ అప్పటికే రాత్రి కావడం, వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోటు సాయంతో బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ప్రయత్నించినా వీలుపడలేదు.

దీంతో డ్రోన్‌ సాయంతో బాధితులకు ఆహారాన్ని అందజేశారు. ఉదయం 6 గంటలకు బోటు సహాయంతో వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం.. బాధితులకు లైఫ్‌ జాకెట్లు అందజేసి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఎంతో కష్టపడి బయటకు తీసుకువచ్చిన సహాయక బృందాలకు కూలీలు ధన్యవాదాలు తెలిపారు.

Related posts