telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టిఆర్ఎస్ దానిని అపవిత్రం చేస్తుంది…

రాష్ట్ర వ్యహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ… నాగార్జునుడు నడియాడిన నేలను టిఆర్ఎస్ అపవిత్రం చేస్తుంది. సాగర్ లో టిఆర్ఎస్ లెగ్, పెగ్ సంస్కృతి తీసుక వస్తుంది అని అన్నారు. డబ్బుతో, మద్యంతో ప్రజలను టిఆర్ఎస్ మభ్యపెట్టాలని చూస్తుంది. సాగర్ ఎన్నికలో టిఆర్ఎస్ ఎన్నికల కోడ్ ను ఉల్లఘిస్తుంది. డ్రగ్స్ కేసులో 4 టిఆర్ఎస్  ఎమ్మెల్యేలు ఉన్నట్లు వార్తలు రావడం దురదృష్టకరం. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పుతుంది అని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించలని ఓట్లు వేస్తే డ్రగ్స్ తీసుకుంటారా… తెలంగాణ ప్రజాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తారు. ఎంఐఎం కూడా రేవ్ పార్టీలు చేస్తుంది. రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల జీవితాలతో అడుకుంటున్నారు. ఎవరైనా కొత్త పార్టీలు పెట్టుకోవచ్చు. షర్మిలకు  కూడా కొత్త పార్టీ పెట్టుకొనే హక్కు ఉంది అని ఆయన తెలిపారు. అయితే చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై తెరాస నేతలు ఎలా సమాధానం ఇస్తారు అనేది.

Related posts