స్టార్ హీరోయిన్ నయనతార- డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ విహాహం నేడు (జూన్ 9) వైభవంగా జరిగింది. చెన్నైలోని మహాబలిపురంలో మహాబలిపురంలోని షెరిటన్ హోటల్లో హిందూ సంప్రదాయం ప్రకారం సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వీరి పెళ్లి వేడుకలు జరిగాయి.దానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరి వివాహానికి సూపర్స్టార్ రజనీకాంత్, హీరో కార్తి, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దర్శకుడు అట్లీ, నిర్మాత బోనీకపూర్, మణిరత్నం హాజరై సందడి చేశారు.
కాగా పెళ్లికి కాసేపు ముందు విఘ్నేశ్.. నయన్కు ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ రోజు జూన్ 9 అంటే ఈరోజు నయన్ డే. భగవంతుడు, విశ్వం, నా జీవితంలోని ప్రతిఒక్కరి ఆశీస్సులకు ధన్యవాదాలు..
“మంచి వ్యక్తులు, సమయాలు, అనుకోని మధుర సంఘటనలు, ఆశీస్సులు, షూటింగ్ రోజులు, దేవుడి ప్రార్థనలు.. నా జీవితం ఇంత అందంగా ఉండటానికి ఇవే కారణం. ఇక ఇప్పుడు లవ్ ఆఫ్ మై లైఫ్ నయన్కు దీన్ని అంకితం చేస్తున్నాను.
మై తంగమై.. నువ్వు పెళ్లి కుమార్తెగా ముస్తాబై వేదికపైకి రావడాన్ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో జీవితంలోని కొత్త అంకాన్ని ప్రారంభించేందుకు ఆనందంగా ఉన్నారు” అని విఘ్నేశ్ శివన్ పోస్ట్ చేశారు.
“నయన్ మేడమ్ నుంచి కాదంబరీ.. తంగమై.. ఆ తర్వాత నా బేబీ.. నా ఉయిర్.. నా కణ్మని.. ఇప్పుడు నా భర్య.. వరకు” అంటూ నయన్పై తన ప్రేమను చాటుకున్నాడు విఘ్నేశ్.