telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఏ1 ఎక్స్‌ప్రెస్ నుండి విడుదలైన మొదటి పాట…

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ కెరీర్‌లో మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అందులో భాగంగా ఓ సరికొత్త ప్రయోగానకి తెరతీశారు. టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా హాకీ నేపథ్యంలో మొట్టమొదటి సారి ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను సినిమా టీజర్, పోస్టర్‌లు తారాస్థాయికి తీసుకొని వెళ్లాయి. ఈ సినిమా సందీప్ కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసారు.. ‘వీధికో జాతంటూ, జాతికో వీధంటూ విడిపోయి మీరుంటే, బలహీనులవుతుంటే’ అంటూ సాగుతున్నా ఈ పాట అందర్నీ ఆకర్షిస్తుంది. అయితే ఈ పాటలో రాజకీయాల గురించి వివరిస్తున్నట్లు ఉంది. అయితే ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మార్చి5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో ఇందులో హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని జీవన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, రఘుబాబు, మురళీ శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts