telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాధితురాలికి సహాయం కావాలంటే మేం సిద్ధం : కృష్ణుడు

Krishnudu

తనపై 139 మంది అత్యాచారం చేశారని ఇటీవలే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన యువతి ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కొన్ని కీలక విషయాలు తెలిపింది. తనని 139 మంది రేప్ చేయలేదని, తన ఫ్యామిలీని చంపేస్తానని డాలర్ బాయ్ బెదిరించి కేసును తప్పుదోవ పట్టించాడని బాధితురాలు పేర్కొన్నది. డాలర్ బాయ్ ఒత్తిడి వలనే కేసులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడుకి పేరు చేర్చినట్టు ఆమె చెప్పింది. ఈ విషయం పై నటుడు కృష్ణుడు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ… “యాంకర్ ప్రదీప్ తో పాటు నా పేరు మొదట ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మాకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆ బాధితురాలు నిజం మాట్లాడింది. అయితే సెలబ్రిటీల పై ఆరోపణలు రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మాకు కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు ఉన్నారు. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ట్రొల్ చేస్తున్నారు. అయితే బాధితురాలికి మా తరుపున ఎలాంటి సహాయం కావాలన్నా మేం సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు. మహిళలు ఎవరికైనా ఆపద ఉంటే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోండి అని సూచించిన ఆయన దిశ ఘటన తరువాత డయల్ 100 ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసిందే అన్నారు కృష్ణుడు.

Related posts