telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్ అభియాన్ పేరిట రూ.20 లక్షల కోట్ల ప్యాకేజి!

modi on jammu and kashmir rule

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజి ప్రకటించారు. 21వ శతాబ్దం భారత్ దేనని, ఈ ప్యాకేజి అండగా మన దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాజా ప్యాకేజి భారత్ జీడీపీలో 10 శాతం ఉంటుందని అన్నారు.

ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిపారు. పేదలు, వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులకు ఈ ప్యాకేజి ఊతమిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తారని మోదీ పేర్కొన్నారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుందని తెలిపారు.

Related posts