telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మహిళా క్రికెటర్లు శిఖా పాండే, దీప్తి శర్మ అర్జున అవార్డుకి నామినేట్

BCCI

ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకి భారత మహిళా క్రికెటర్లు శిఖా పాండే, దీప్తి శర్మ నామినేట్ అయ్యారు. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో నిలకడగా రాణించిన ఈ ఇద్దరి క్రికెటర్ల పేర్లని అర్జున అవార్డుకి బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్ టీమ్ తాజాగా పంపినట్లు ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ సంస్థ తెలిపింది. దేశంలోని స్పోర్ట్స్ అసోషియేషన్స్ నుంచి నామినేషన్స్‌ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ స్వీకరిస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఫైనల్‌కి చేరిన భారత్ జట్టు.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే.. టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన శిఖా పాండే ఏడు వికెట్లు పడగొట్టగా.. 3/14 అత్యుత్తమం. ఇక ఆల్‌రౌండర్‌గా దీప్తి శర్మ మొదటి మ్యాచ్‌ నుంచే తన మార్క్ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన దీప్తి.. టోర్నీలో మొత్తం 116 పరుగులు చేసింది. మొత్తంగా భారత్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. నిలకడగా రాణించిన ఈ ఇద్దరి పేర్లని నామినేషన్‌కి పంపాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2018లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అర్జునా అవార్డుని దక్కించుకోగా.. 2019లో ఆ అవకాశం టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి దక్కింది. అయితే.. ఈ ఏడాది భారత ఫురుష క్రికెటర్ల ఎవరూ నామినేషన్‌లో నిలిచే సూచనలు కనిపించడం లేదు.

Related posts