telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు

bandi samjay mp

కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నల్గొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.   నిన్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో  సంజయ్  పర్యటించారు. జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

బత్తాయి దిగుబడి సరిపడా లేకపోడంతో రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదని ఆయన అన్నారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే బత్తాయిలు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా భౌతిక దూరం నిబంధనలను గాలికి వదిలేశారని ఆరోపిస్తూ పెద్దవూర పోలీసులు బండి సంజయ్‌తోపాటు పలువురు బీజేపీ నేతలపైనా 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.

Related posts