telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడోద్దు..

ఏపీలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ నేప‌థ్యంలో విద్యా సంస్థల మూసివేయాల‌ని విద్యార్థులు తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసారు.

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విద్యా సంస్థల మూసివేత కొనసాగించాలని ఆ లేఖలో కోరారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయన్నారు.

15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు.

గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, గడిచిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5వేలకు పెరిగాయని.. ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Related posts