telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నారా లోకేష్ కు కరోనా పాజిటివ్‌..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు ఎటువంటి సింటమ్స్ లేవని, ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు వివరించారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు తప్పని సరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని నారా లోకేష్ కోరారు. మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్నవేళ అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 

 

Related posts