telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మహిళల భద్రతపై చర్చిస్తోంటే.. ఉల్లి కోసం టీడీపీ గొడవ: రోజా

roja ycp mla

ఏపీ అసెంబ్లీ లో వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. ‘దిశ ఘటనతో మహిళలు తల్లడిల్లి పోయారు. ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించింది. మహిళల భద్రత కోసం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మహిళల భద్రతపై చర్చిస్తోంటే.. ఉల్లి కోసం టీడీపీ గొడవపడుతుందని రోజా అన్నారు. లోకేశ్ తినే పప్పులో ఉల్లి పాయ గురించే చంద్రబాబు ఆలోచన.

చర్చను అడ్డుకుంటున్న వారు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? మహిళల పట్ల టీడీపీకి ఉన్న చిత్త శుద్ధి ఏంటో అర్థమవుతుంది.13 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకోవడం కాదు. మహిళల్లో ధైర్యం నింపేలా చంద్రబాబు ప్రవర్తించాలి’ అని రోజా అన్నారు. దిశ ఘటన జరిగినప్పుడు మానవ హక్కుల సంఘం కనీసం దిశ కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. కానీ, ఎన్ కౌంటర్ జరిగాక స్పందిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన అంటూ అరుస్తున్నారని రోజా విమర్శించారు.

Related posts