వైసీపీ శ్రేణులు దాడి లో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ కంటిచూపు కోల్పోయారు. చెన్నుపాటి గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ దాడిని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఇంకెన్నాళ్లీ నెత్తుటి రాజకీయాలు చేస్తారు జగన్రెడ్డి గారు అంటూ మండిపడ్డారు.
మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ గారి పై దాడికి తెగబడింది మీ వైసీపీ ఫ్యాక్షన్ మూకలే. అధికారం శాశ్వతమనుకుని పోలీసుల సాయంతో రక్తచరిత్ర రాస్తున్నావు అంటూ మండిపడ్డారు
మా సహనం చేతకానితనం కాదు. తిరుగుబాటు మొదలైంది. అధికారం అండతో రెచ్చిపోతున్న వైసీపీ రౌడీమూకలకి మరోసారి హెచ్చరిస్తున్నాను. ప్రతీ పేరు రాసుకున్నాం. కొడితే కొట్టించుకుంటున్నాం అనుకుంటున్నారు మీరు.
మేము తిరిగి కొట్టే రోజున జగన్ రెడ్డి రారు, పోలీసులు కనపడరు. దెబ్బకి దెబ్బ ఎలా వుంటుందో చూపిస్తాం. చెన్నుపాటి గాంధీ పై దాడి చేసిన వైసీపీ రౌడీలు, దాడి వెనుక ఉన్న వైసీపీ నేతలను తక్షణమే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.