telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మన గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

chandrababu gift on may day

రాష్ట్రంలో మన గెలుపును ఎవరూ ఆపలేరని, 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 110 అసెంబ్లీ స్థానాలతో మన గెలుపు ప్రారంభమవుతుందని, ఇది 120-130వరకూ వెళ్లొచ్చని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మైండ్ గేమ్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదంగా మార్చిందన్నారు. రేపు అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని తెలిపారు. వీవీ పాట్లు లెక్కించాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదని దుయ్యబట్టారు. 22న కౌంటింగ్ ప్రక్రియపై అందరికీ మరోమారు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వీవీ పాట్ల లెక్కింపులోను జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Related posts