telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబో మరింత లేట్‌..

prabhas

ప్రభాస్ దేశమంతటా అభిమానులు ఉన్న హీరోల్లో ఒకడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో కొత్తగా ఓ సినిమా తెరకెక్కేందుకు రూపొందనుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కుతొందని అందరూ భావించారు. కానీ ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్‌కు సిద్దమయ్యాడు. అయితే నాగ్ అశ్విన్‌, ప్రభాస్ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుందని, ఈ సినిమాలో కథానియికగా బాలీవుడ్ భామ దీపికా పదుకొణేను ఎంపిక చేశారు. ఈ సినిమాను తీసేందుకు వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు లెజెండరీ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ సినిమా భారతీయ భాషలతో పాటు మరికొన్న విదేశాల భాషల్లోనూ రూపొందనుంది. అయితే రాధే శ్యామ్ తరువాత ప్రభాస్ ఈ సినిమా మొదలు చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రాధే శ్యామ్ పూర్తయిన వెంటనే ఆదిపురుష్‌కు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఆదిపురుష్ 2022 ఆగస్టుకి విడుదల అవుతుందని ప్రకటించారు. మరి నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది అభిమానులకు అర్థం కావట్లేదు. ఎంత కష్టపడినా 2023 నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడవం జరగదు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ చాలా సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ సినిమా మొదలు అయ్యేసరికి ప్రభాస్ ఎలా ఉంటాడో, దీపిక ఎలా ఉంటుందో అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఏదేమైనా ఈ సినిమా ఇప్పట్లో ప్రేక్షకుల ముందు రాదని వార్తలు వస్తున్నాయి.

Related posts