ప్రముఖ కోలీవుడ్ నటి, మిస్ సౌత్ ఇండియా విజేత మీరా మిథున్కు హత్యా బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం మీరా మిథున్ బిగ్బాస్3 సీజన్ షో హౌస్లో వుంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి కేరళకు చెందిన ఓ వ్యక్తి తమ కుమార్తె బిగ్బాస్ షో నుంచి బయటకు రావాలని, సోషల్ మీడియాలో ఆమె గురించి అసత్య ప్రచారాలు చేయడంతో పాటు హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీరా మిథున్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2016లో జరిగిన మిస్ సౌత్ ఇండియా పోటీలలో మీరా మిథున్ పాల్గొని విజేతగా నిలిచింది. అనంతరం కోలీవుడ్లో నటిగా పరిచయమైంది. ఇటీవల ఆమెకు ఇచ్చిన మిస్ సౌత్ ఇండియా బిరుదును ఆ సంస్థ వెనక్కి తీసుకుంది.
previous post