telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై…

ఈరోజు చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని హైదరాబాద్ ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంది. అందుకే నాలుగు మార్పులతో బరిలోకి దిగ్గుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది… ఎవరు గెలుస్తారు అనేది.

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), మనీష్ పాండే, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్య, రాహుల్ చాహర్, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

Related posts