telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలను నమ్మించి మోసం చేశారు: రఘురామ కృష్ణ రాజు

Raghuramakrishnaraju ycp mp

మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఘాటుగా స్పందించారు. రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఇది ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు.

మూడు రాజధానులనేదే మోసమని, తడి గుడ్డతో గొంతు కోయడమని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకటే రాజధాని అని.. ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారని చెప్పారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్పారు. అమరావతి రైతులకు తోడుగా రాష్ట్ర ప్రజలందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related posts