ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్కుమార్ ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన బాధ్యతలను స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.
విజయవాడ బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో విధులు నిర్వహించిన ఛాంబర్ లోనే ఇప్పుడు కూడా బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు ఆయన తిరిగి నియామకమవడంతో ఏపీలో సర్వత్ర ఆసక్తి నెలకొంది.